భద్రాద్రి కొత్తగూడెంలో కంటైనర్ దగ్ధం

భద్రాద్రి కొత్తగూడెంలో కంటైనర్ దగ్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం దగ్గర కంటైనర్ దగ్ధమైంది. CRPF క్యాంపునకు సామాగ్రిని తరలిస్తున్న కంటైనర్ కు విద్యుత్ తీగలు తగలటంతో కాలి బూడిదయింది. కంటైనర్ లో తరలిస్తున్న 34 మోటర్ సైకిళ్లు, ఇతర సామాగ్రి దగ్ధం అయింది. దీంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. కాగా.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఇష్టం జరగలేదు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కంటైనర్ ను పరిశీలించారు.