
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూ భారతిలో సర్వేయర్లే కీలకమని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తెలిపారు. కొత్తగూడెం యూనివర్శిటీ ఆఫ్ మైనింగ్కాలేజీలో ఏర్పాటు చేసిన లైసెన్స్ సర్వేయర్ల ట్రైనింగ్ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణను సర్వేయర్లుగా ఉపయోగించుకోవాలన్నారు. 50రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతోందని చెప్పారు.
ప్రభుత్వ కొత్త భూ రికార్డుల చట్టాన్ని అమలు చేయడంలో సర్వేయర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ట్రైనింగ్ అనంతరం లైసెన్స్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. సర్వేకుసంబంధించిన కిట్లు, స్టడీ మెటీరియల్స్ను ఆయన అందజేశారు. ఈ ప్రోగ్రాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మైనింగ్ కాలేజీ ఏడీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.