భూ భారతిలో సర్వేయర్లే కీలకం : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​ 

భూ భారతిలో సర్వేయర్లే కీలకం : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూ భారతిలో సర్వేయర్లే కీలకమని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​ వీ పాటిల్​తెలిపారు. కొత్తగూడెం యూనివర్శిటీ ఆఫ్​ మైనింగ్​కాలేజీలో ఏర్పాటు చేసిన లైసెన్స్​ సర్వేయర్ల ట్రైనింగ్​ శిబిరాన్ని  సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణను సర్వేయర్లుగా ఉపయోగించుకోవాలన్నారు. 50రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతోందని చెప్పారు.

ప్రభుత్వ కొత్త భూ రికార్డుల చట్టాన్ని అమలు చేయడంలో సర్వేయర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ట్రైనింగ్​ అనంతరం లైసెన్స్​లు ఇవ్వనున్నట్లు చెప్పారు. సర్వేకుసంబంధించిన కిట్లు, స్టడీ మెటీరియల్స్​ను ఆయన అందజేశారు. ఈ ప్రోగ్రాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మైనింగ్​ కాలేజీ ఏడీ శ్రీనివాస్, ఇన్స్​పెక్టర్​ శ్రీనివాస్​  పాల్గొన్నారు.