ఓపెన్​ ఇంటర్, టెన్త్​ ఎగ్జామ్స్​పక్కాగా నిర్వహించాలి : వేణుగోపాల్

ఓపెన్​ ఇంటర్, టెన్త్​ ఎగ్జామ్స్​పక్కాగా నిర్వహించాలి : వేణుగోపాల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఓపెన్ ​ఇంటర్, టెన్త్​ ఎగ్జామ్స్​ పక్కాగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం అడిషనల్​కలెక్టర్​ వేణుగోపాల్​అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో పలు శాఖల అధికారులతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మే 2 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్​నిర్వహించనున్నట్లు తెలిపారు. టెన్త్​ ఎగ్జామ్స్​కు జిల్లాలో మూడు సెంటర్లు, ఇంటర్మీడియట్​కు నాలుగు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

ఓపెన్​ టెన్త్​ ఎగ్జామ్స్​కు 846 మంది, ఇంటర్​లో 978 మంది ఎగ్జామ్స్​కు అటెండ్​ కానున్నారని తెలిపారు. ఎగ్జామ్స్​ సెంటర్ల ప్రాంతాల్లో 144 సెక్షన్​ అమలులో ఉంటుందన్నారు. ఎగ్జామ్స్​ సెంటర్లలో తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్​ జిల్లా అధికారి సులోచనా రాణి, డీఈవో వెంకటేశ్వరాచారితో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.