
పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్ధులకు ఇన్విజిలేటర్లు చుక్కలు చూపించారు. ఎగ్జామ్ హాల్లో పరీక్షలంటే ఇన్విజిలేటర్లు, సీసీ కెమోరాలలతో చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఎగ్జామ్ హాల్లో విద్యార్ధులు కాపీ కొట్టకుండా వారి తలలకు అట్టపెట్టలు పెట్టించి మరీ పరీక్షలు రాయించారు ఇన్విజిలేటర్లు. ఇన్విజిలేటర్ల తీరు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైంది. విద్యార్ధుల పట్ల అతిగా ప్రవర్తించిన యాజమాన్యం వివరణ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
బెంగళూరులోని హావేరిలోని భగత్ ఫ్రీ యూనివర్సిటీలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్ సందర్భంగా విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా అట్టపెట్టలతో అతిగా ప్రవర్తించారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సదరు ఇన్విజిలేటర్లు చేసిన తప్పుపై వివరణ ఇవ్వాలని హుకుం జారీ చేశారు.