భైంసాలో అర్ధరాత్రి కత్తిపోట్ల కలకలం

భైంసాలో అర్ధరాత్రి కత్తిపోట్ల కలకలం

భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోపాల్ నగర్ కాలనీలో అర్ధరాత్రి కత్తిపోట్ల కలకలం రేపింది. తోట శంకర్ (30) అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడి అరుపులు విని స్థానికులు రావడంతో సదరు వ్యక్తి తన బైక్ ను అక్కడే వదిలేసి పారిపోయాడు. అనంతరం శంకర్ ను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.