కర్ణాటక మాలూర్లో భారత్ బయోటెక్ వ్యాక్సిన్​ తయారీ యూనిట్

కర్ణాటక మాలూర్లో భారత్ బయోటెక్  వ్యాక్సిన్​ తయారీ యూనిట్

బెంగళూరు: పొరుగు రాష్ట్రం కర్నాటకలో పెట్టుబడులు పెడతామని హైదరాబాద్​కు చెందిన వ్యాక్సిన్​ తయారీ కంపెనీ భారత్​ బయోటెక్ ప్రకటించింది. ఆ రాష్ట్ర భారీ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి మురుగేశ్​ నిరానీ, భారత్​ బయోటెక ఎండీ కృష్ణ ఎల్లతో హైదరాబాద్​లో శుక్రవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నిరానీ మాట్లాడుతూ పెట్టుబడిదారులకు అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాల గురించి ఆయన కృష్ణకు వివరించి, వచ్చే నెల మొదటి వారంలో బెంగళూరులో జరిగే గ్లోబల్​ ఇన్వెస్టర్​ సమిట్​కు రావాలని ఆహ్వానించారు. కర్ణాటకలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని కృష్ణ అన్నారు. భారత్​ బయోటెక్​కు కర్ణాటకలోని మాలూర్​లో వ్యాక్సిన్​ తయారీ యూనిట్​ ఉంది.