బెంగళూరు: పొరుగు రాష్ట్రం కర్నాటకలో పెట్టుబడులు పెడతామని హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ ప్రకటించింది. ఆ రాష్ట్ర భారీ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి మురుగేశ్ నిరానీ, భారత్ బయోటెక ఎండీ కృష్ణ ఎల్లతో హైదరాబాద్లో శుక్రవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నిరానీ మాట్లాడుతూ పెట్టుబడిదారులకు అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాల గురించి ఆయన కృష్ణకు వివరించి, వచ్చే నెల మొదటి వారంలో బెంగళూరులో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్కు రావాలని ఆహ్వానించారు. కర్ణాటకలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని కృష్ణ అన్నారు. భారత్ బయోటెక్కు కర్ణాటకలోని మాలూర్లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఉంది.