
భారత్ ఎర్త్ మూవర్స్(బీఈఎంఎల్) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: మొత్తం 440.
పోస్టులు: ఐటీఐ(ఫిట్టర్) 189, ఐటీఐ(టర్నర్) 95, ఐటీఐ (వెల్డర్) 91, ఐటీఐ (మెషినిస్ట్) 52, ఐటీఐ (ఎలక్ట్రీషియన్) 13.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: జనరల్, ఈడబ్ల్యూఎస్ 29 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 34 ఏండ్లు, ఓబీసీలకు 32 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 05.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్లిస్ట్, రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు cbtexam.bemlindia.in వెబ్సైట్లో సంప్రదించగలరు.