రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్రు

రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్రు

ఎర్రుపాలెం, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ఇనగాలి, రాజులదేవరపాడులో పీపుల్స్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాము జడవబోమన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం దేశభక్తులు, ప్రజాస్వామికవాదులు సెక్యులర్ కూటమిగా ఏర్పడాలన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి, బీజేపీ మతతత్వానికి వ్యతిరేకంగా ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మధిర మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిశోర్ కుమార్, ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండారు నరసింహారావు, ఏవీ కృష్ణారావు, రామారావు, కంచర్ల వెంకట నరసయ్య, నర్సిరెడ్డి, నాగిరెడ్డి, బోసు, భాషా తదితరులు పాల్గొన్నారు.