6 గ్యారంటీలను మొదటి 100 రోజుల్లో అమలు చేస్తాం: భట్టి విక్రమార్క

6 గ్యారంటీలను మొదటి 100 రోజుల్లో అమలు చేస్తాం: భట్టి విక్రమార్క

పేదల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీల చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. 23 మంది ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారన్నారు. ఆత్మ గౌరవంతో బ్రతకడానికి.. కావాల్సిన వాళ్లకు చేయూత ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.

మొదటి కేబినెట్ సమావేశంలోనే 6 గారంటీలకు ఆమోదం తెలిపామని ధీమా వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలను మొదటి 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఈ గ్యారంటీల వల్ల పేదలకు మంచి జరుగుతుందని చెప్పారు. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ను తీసుకురాబోతున్నామన్నారు.