బాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాలకు వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ డడ్లీ.. చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’ తో టాలీవుడ్కు పరిచయమవుతున్నాడు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా డడ్లీ మాట్లాడుతూ ‘నా అసలు పేరు రాజేంద్రన్. మాది తమిళనాడులోని ఊటీ. అక్కడే ఫిలిం టెక్నాలజీ చదివాను. తర్వాత ముంబై షిఫ్ట్ అయ్యా. దర్శకుడు మెహర్ రమేష్, నేను పదేళ్లుగా మంచి స్నేహితులం. లాక్ డౌన్లో ఓ రోజు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే చాలా థ్రిల్ అయ్యాను. చిరంజీవి గారంటే ఓ ఎన్సైక్లోపీడియా, పర్ఫెక్షనిస్ట్, ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఆయన పంక్చువాలిటీని ఎవరూ మ్యాచ్ చేయలేరు. పంక్చువాలిటీ, ప్రొఫెషనలిజం విషయంలో సౌత్తో పోల్చితే బాలీవుడ్ కొంచెం భిన్నంగా ఉంటుంది.
‘వేదాళం’కి రీమేక్ అయినా మెగాస్టార్ స్టయిల్కి తగ్గట్టు మార్పులు చేశాం. ఒరిజినల్ కంటే ఈ సినిమా బెటర్గా ఉంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా టఫ్ అనిపించింది. ఒరిజినల్ వెర్షన్ని మ్యాచ్ చేస్తూ ప్రజంటేషన్ పరంగా డిఫరెంట్గా ఉండేలా చాలా గ్రాండ్గా తీశాం. మెగాస్టార్, తమన్నా, కీర్తి సురేష్ లాంటి స్టార్స్తో వర్క్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది’అని చెప్పాడు.