కరీంనగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో మే 31న (బుధవారం) శ్రీవారి ఆలయం నిర్మాణానికి సంబంధించి భూమి పూజ నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 6 గంటల 50 నిమిషాల సమయం నుండి 7 గంటల 20 నిమిషాల వరకు భూమి పూజ కార్యక్రమం కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు మంకమ్మ తోట వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి పద్మానగర్ వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయ నిర్మాణ స్థలంలో శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.
భూమి పూజ వేడుకల్లో పాల్గొనేందుకు తిరుమల నుంచి రెండు గజరాజులను (ఏనుగులు) కరీంనగర్ కు తీసుకువచ్చారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గజరాజుల ఆశీర్వాదం తీసుకున్నారు.