
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కారు బీభత్సం ఘటన బాధితులను పరామర్శించారు పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ. కాటారం మండలం గంగారం ఎస్సీ కాలని లో కారు బీభత్స ఘటన స్థలాన్ని పరిశీలించారు. యాక్సిడెంట్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
మృతి చెందిన డెడ్ బాడీని చూసిన ఆయన.. తీవ్ర గాయాల పాలైన కుటుంబ సభ్యులను పరమర్శించి ఓదార్చారు. భాదితులను న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఆ ఘటనపై పై పోలీసుల దర్యాప్తు ఆలస్యం కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి గంట అవుతున్నా పోలీసులు స్పందించకపోవడంతో జిల్లా ఎస్పీ కిరణ్ కరే కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా ఎందుకు స్పందించడం లేదని.. ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారని ఫైరయ్యారు. రోడ్డు పై డెడ్ బాడీ సుమారు రెండు గంటలు ఉన్నా కనీసం పోలీసులు రాకపోవడమేంటని ప్రశ్నించారు.
డ్రింక్ చేసి రాష్ డ్రైవింగ్ కు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ వాసులు దళితులనే చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి వివరాలు ఎంపీకి చెప్పగా.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
పుష్కరాల్లో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం:
కాటారం మండల పర్యటనలో భాగంగా గంగారం లో ఇటీవల మృతి చెందిన మంతెన శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలల్లో పారిశుధ్య పనులల్లో విధులు నిర్వహించిన మంతెన శ్రీనివాస్.. ఎండ దెబ్బ తో మృతి చెందాడు.
ఇవాళ (జూన్ 2) వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు ఎంపీ వంశీ కృష్ణ. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.