బిగ్ బ్రేకింగ్ : వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత..

బిగ్ బ్రేకింగ్ : వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత..

వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. హోటల్ యజమానులే కాదు.. టిఫిన్ సెంటర్ ముసుగులో ఇడ్లీలు, దోశలే కాదు.. డ్రగ్స్ అమ్ముతున్న కేటుగాళ్లలో.. ఓ సినీ నిర్మాత ఉన్నట్లు ప్రకటించారు పోలీసులు. ఇప్పటి వరకు ఓ లేడీ కిలాడీతోపాటు వరలక్ష్మి టిఫిన్ సెంటర్, పల్లెటూరి పుల్లట్లు హోటళ్ల యజమానులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు.. దీని వెనక సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ సినీ నిర్మాత కూడా ఉన్నట్లు వెలుగులోకి రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ సిటీ డ్రగ్స్ కేసులో ఇది బిగ్ బ్రేకింగ్ అయ్యింది..

Also Read : మామ తెచ్చిన చిచ్చు : దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్.. తిట్టిపోస్తున్న టీడీపీ సోషల్ మీడియా

డ్రగ్స్  సరఫరా చేసిన ముగ్గరు నైజీరియన్లతో పాటు  పరారీలో ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ అయ్యారు.  నిందుతుల నుంచి 50 గ్రాముల MDMA తో పాటుగా, ఎనిమిది గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్స్ టీమ్స్.  పోలీసుల అదుపులో సినీ నిర్మాతతో పాటుగా ఐదుగురు కస్టమర్లు ఉన్నారు.  వీరిని ఈ రోజు సాయంత్రం ముందు ప్రవేశ పెట్టి వివరాలను వెల్లడించనున్నారు హైదరాబాద్ సీపీ అనంద్,  

కొన్నిరోజుల క్రితం సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళిలు కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు డ్రగ్ పార్టీని భగ్నం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న నార్కొటిక్ బ్యూరో అధికారులు నిందితులను విచారించారు. సినీ ఇండస్ట్రీకి చెందిన 18 మంది ప్రముఖులు, మరికొంత మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఫైనాన్షియర్ వెంకట్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు.