బీహార్లోని బార్హ్ రైల్వే స్టేషన్లో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లల పైకి రైలు వెళ్లింది. అయినప్పటికీ వారంతా క్షేమంగా బయటపడ్డారు. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక వైరల్ వీడియోలో ఆ మహిళ ఫ్లాట్ ఫారమ్ అంచున ఉండగా.. , పిల్లలు మాత్రం ట్రాక్లపై వంగి ఉన్నట్లు చూపిస్తుంది. మహిళ, ఆమె పిల్లలు బెగుసరాయ్ నుండి వచ్చారని, భాగల్పూర్ నుండి ఢిల్లీకి వెళ్లే విక్రమశిలా ఎక్స్ప్రెస్లో తమ కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళుతున్నారని సమాచారం. ఈ క్రమంలో బార్హ్లో వారు రైలు ఎక్కుతుండగా, ప్లాట్ఫారమ్పై పెద్ద సంఖ్యలో గుమికూడడంతో మహిళ తన పిల్లలతో ట్రాక్పై పడిపోయింది.
అక్కడున్న జనం వెంటనే ఆమెను గమనించి, రక్షించారు. కానీ అప్పటికే రైలు స్టేషన్ నుండి బయలుదేరడం ప్రారంభించింది. దీంతో ఆ మహిళ పట్టాలపై వంగిపోగా.. ఆ పిల్లల పైకి రైలు దూసుకుపోయింది. రైలు ప్లాట్ఫారమ్ నుండి వెళ్లిపోయిన తరువాత, అక్కడున్న వారు వెంటనే ప్లాట్ఫారమ్ నుండి కిందకు దూకి మహిళ, ఆమె పిల్లలను రక్షించారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.