బైక్ ఇవ్వలేదని  ఫ్రెండ్ వెహికల్ ను పెట్రోల్ పోసి తగులబెట్టాడు

బైక్ ఇవ్వలేదని  ఫ్రెండ్ వెహికల్ ను పెట్రోల్ పోసి తగులబెట్టాడు

ఫ్రెండ్ ను బైక్ అడిగితే ఇవ్వనందుకు అతడి బైక్ పై పెట్రోల్ పోసి తగులబెట్టాడో యువకుడు.  నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలిపారు. హిమాయత్ నగర్ స్ట్రీట్ నం.1లో ఉండే అవినాశ్ రెడ్డి, వినీత్  ఫ్రెండ్స్. వినీత్ సోమవారం అర్ధరాత్రి బైక్ కావాలని అవినాశ్​ రెడ్డిని అడిగాడు. బైక్ లో పెట్రోల్ లేకపోవడంతో ఇవ్వనని అవినాశ్ రెడ్డి వినీత్ తో చెప్పాడు.  అవినాశ్ రెడ్డి కావాలనే తనకు బైక్ ఇవ్వలేదని వినీత్ కోపం తెచ్చుకున్నాడు. వినీత్ తన మరో ఫ్రెండ్ ఆనంద్ ను తీసుకుని మంగళవారం తెల్లవారుజామున అవినాశ్​రెడ్డి బైక్ ను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అవినాశ్​రెడ్డి నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు అవినాశ్​రెడ్డి ఫ్రెండ్ వినీత్, అతడికి సహకరించిన ఆనంద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.