అడ్వర్టైజ్మెంట్ బోర్డును ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

అడ్వర్టైజ్మెంట్ బోర్డును ఢీకొట్టిన బైక్.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

గండిపేట, వెలుగు: అడ్వర్టైజ్​మెంట్ బోర్డును బైక్​ఢీకొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు.  బండ్లగూడకు చెందిన వుయ్యాల సరిశ్ (23) తన స్నేహితుడు క్రిష్​సింగ్​తో కలిసి శుక్రవారం ఉదయం కాళీమందిర్‌‌‌‌ వద్ద టిఫిన్ చేసి బైక్​పై తిరిగి వస్తున్నారు. సన్​సిటీ హెచ్​డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న అడ్వర్టైజ్​మెంట్ బోర్డును ఢీకొట్టారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమైన సరిశ్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన క్రిస్​సింగ్​ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.