
- బైక్ మెకానిక్, ముగ్గురు మైనర్లు అరెస్ట్
పద్మారావునగర్, వెలుగు: బైక్ చోరీలకు పాల్పడుతున్న బైక్మెకానిక్ను ఈస్ట్జోన్పోలీసులు అరెస్ట్చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ భోలక్పూర్కు చెందిన పస్తం వంశీతేజ అలియాస్ నాగులబండ(21) బైక్ మెకానిక్. ఇతనికి రిపేర్లు చేయడంతోపాటు డూప్లికేట్కీస్ తయారుచేయడం వచ్చు. నెల రోజుల కింద సరూర్నగర్కు చెందిన ఓ యువతిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.
బైక్రిపేర్లతో వచ్చే ఆదాయం సరిపోక ఈజీ మనీ కోసం ముగ్గురు మైనర్లతో కలిసి డూప్లికేట్కీస్తో బైక్చోరీలు స్టార్ట్చేశాడు. ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 2, బోడుప్పల్లో 3, ఉప్పల్ లో 2 బైకులను ఎత్తుకెళ్లాడు. వాటిని మైనర్ల ఇంటి వద్ద దాచాడు. శుక్రవారం ఉదయం సీతాఫల్మండి చౌరస్తాలో వంశీతేజ పోలీసులకు చిక్కాడు.
వంశీతేజ గతంలో చోరీ, గంజాయి కేసులో జైలుకు వెళ్లొచ్చాడని పోలీసులు తెలిపారు. మరో కేసులో తుకారంగేట్కు చెందిన కారు డ్రైవర్అడ్డాకుల విజయ్కుమార్, ఆలకుంట అక్షయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కలిసి తొమ్మిది బైకులు చోరీ చేసినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.