
శామీర్పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీలో బిల్కలెక్టర్ రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్ ఏసీబీకి చిక్కారు. సిటీకి చెందిన ఓ వ్యక్తి తూంకుంట పరిధిలో రెండు ఇండ్లు కొనుగోలు చేసి, మ్యుటేషన్ కోసం ఏడాది క్రితం అర్జీ పెట్టుకున్నాడు. ఇందు కోసం ప్రాసెస్ ఫీజు చెల్లించినా.. బిల్ కలెక్టర్ రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రావణ్ రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు.
డబ్బులిస్తేనే మ్యుటేషన్ చేస్తామని వేధించారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, గురువారం లంచం తీసుకుంటుండగా వీరిద్దని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో ఇతరుల పాత్రపై విచారణ చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు