బర్త్‌‌‌‌ డే పార్టీ తర్వాత ఇంటికెళ్లి దారుణం

బర్త్‌‌‌‌ డే పార్టీ తర్వాత ఇంటికెళ్లి దారుణం
  • బర్త్‌‌‌‌ డే పార్టీ తర్వాత ఇంటికెళ్లి దారుణం
  • మేడ్చల్‌‌‌‌ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • ఆలస్యంగా వెలుగులోకి ఘటన.. పోలీసుల తీరుపై అనుమానాలు

జీడిమెట్ల, వెలుగు: బర్త్ డే పార్టీకి రమ్మని పిలిచాడు.. సెలబ్రేషన్స్ అయ్యాక ఇంటి దగ్గర దించుతానని ఫ్రెండ్స్‌‌‌‌తోపాటు వెళ్లాడు. ముచ్చట్లు చెప్పి.. తర్వాత ఇంటికి వెళ్లిపోయినట్లు నటించాడు. ఫ్రెండ్స్‌‌‌‌ అందరూ వెళ్లినంక ఇంట్లోకి చొరబడి స్నేహితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మేడ్చల్‌‌‌‌ జిల్లా బాచుపల్లి పీఎస్​ పరిధిలో జరిగిందీ ఘటన. గుజరాత్‌‌‌‌కి చెందిన యువతి (28) ప్రగతినగర్‌‌‌‌‌‌‌‌లో ఉంటూ కంటెంట్ రైటర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నది. ఈమెకు మణికొండ చిత్రపురికాలనీకి చెందిన రోషన్ (23)తోపాటు క్రాంతి, మణిప్రీత్, కిశోర్ స్నేహితులు. 13న క్రాంతి బర్త్ డే పార్టీ జూబ్లీహిల్స్‌‌‌‌లోని రిపిట్ పబ్‌‌‌‌లో జరిగింది. యువతిని కూడా ఆహ్వానించడంతో ఆమె 13వ తేదీ రాత్రి 7.45కు పబ్‌‌‌‌కి వెళ్లింది. బర్త్ డే సెలబ్రేషన్స్‌‌‌‌ అయ్యాక రోషన్, అతని మిత్రులు ప్రగతినగర్‌‌‌‌‌‌‌‌లోని ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. యువతి ఇంటికి రోషన్, మణిప్రీత్, కిషోర్, క్రాంతి వెళ్లారు. తెల్లవారుజామున 4.30 దాకా మాట్లాడుకున్నారు. తర్వాత అందరూ వెళ్లిపోవడంతో ఆమె నిద్రపోయింది. రోషన్ బయటకు వెళ్లినట్లు నటించి.. వెనక్కి వచ్చి ఉదయం 6.15 సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భయంతో వాష్​రూంలోకి వెళ్లి దాక్కున్న బాధితురాలు.. మిత్రులకు ఫోన్ చేసి చెప్పింది. వారు అక్కడికి వచ్చి రోషన్‌‌‌‌ను తీసుకెళ్లిపోయారు. బుధవారం బాచుపల్లి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా.. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి నిరాకరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.