రాష్ట్రాల హక్కులను కేంద్రం కాల రాస్తోంది

రాష్ట్రాల హక్కులను కేంద్రం కాల రాస్తోంది

సంగారెడ్డి : స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా మహనీయుల ఆశయాలు ఇంకా నెరవేరలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘువులు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూని చేస్తోందంటూ ఆరోపించారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ప్రశ్నించే వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిస్తోందని చెప్పారు. సీబీఐ, ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులను ఉసిగొల్పి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. 

ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల హక్కులను కాల రాస్తున్నారని బీవీ రాఘువులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తూ.. రాష్ట్రాలు మాత్రం ఎక్కువ అప్పులు చేయొద్దంటూ షరతులు విధిస్తోందంటూ మండిపడ్డారు. KVPS  తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలలో ఈ కామెంట్స్ చేశారు.