గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జేపీ నడ్డా

గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జేపీ నడ్డా

హైదరాబాద్:బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ శాంతి ర్యాలీని బీజేపీ విరమించుకుంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ర్యాలీలో పాల్గొనేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ కు చేరుకున్న జేపీ నడ్డా తొలుత గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, తమిళనాడు రాష్ట్ర ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇతర సీనియర్ నేతలు ఉన్నారు. నడ్డాతో పాటు బీజేపీ నేతలు గాంధీకి నివాళులర్పించారు. తర్వాత అక్కడ్నుంచి రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి బయల్దేరారు నేతలు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని భావించినా కోవిడ్ రూల్స్ కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ప్రకటించారు. కాసేపట్లో బీజేపీ ఆఫీసులో జేపీ నడ్డా ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు.