రాహుల్ పై ECకి BJP ఫిర్యాదు

రాహుల్ పై ECకి BJP ఫిర్యాదు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఎలక్షన్ కమిషన్ ను బీజేపీ ఆశ్రయించింది. మోడీ ని చోర్ అంటూ తిడుతున్నారని, ఆయనకు వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, రాహుల్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. రాఫెల్ కేసు విషయంలో మోడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు అనని మాటలు అన్నట్లు రాహుల్ ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. శుక్రవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారమన్, ముఖ్తా ర్ అబ్బాస్ నఖ్వీ తదితరుల బృందం ఈసీకి మెమొరాండం సమర్పించింది. రాహుల్ విషయంలో ఈసీ తీరుపై నిర్మల అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు గురువారం జరిగిన మొదటి దశ లోక్ సభఎన్ని కల్లో పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపించింది.