
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కల్వకుంట్ల కుటుంబ సభ్యుల జేబులు నింపేందుకే తప్ప, వాటితో ప్రజలకు ఒరిగిందేమీ లేదని సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి చెప్పారు. సీఎం కేసీఆర్ ‘ఉత్త కూతల ఉత్తమరావు’ అని, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో వెజ్, నాన్వెజ్తో కూడిన మంచి భోజనం పెడతానని చెప్పి అన్నం, గొడ్డు కారం వడ్డిస్తున్నారని విమర్శించారు.
ఈ మేరకు బుధవారం సరూర్నగర్లో బూందీ లడ్డూ, సకినాలు, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, గుడ్లు, పనీర్తో చేసిన వంటకాలను ఒక ప్లేటులో, మరో ప్లేటులో తెల్ల అన్నం, గొడ్డుకారం ఉంచి వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల టైంలో దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇలా ఎన్నో రకాల హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
- ఫొటోగ్రాఫర్, వెలుగు