ట్రాన్స్ జెండర్ల ను రేవంతన్నే ఆదుకోవాలె

ట్రాన్స్ జెండర్ల ను రేవంతన్నే ఆదుకోవాలె
  • ట్రాన్స్​జెండర్​ సవరణ బిల్లు సరికాదు 
  • మోదీ ప్రభుత్వ తీరు సిగ్గుచేటు..
  • ట్రాన్స్​జెండర్​ కమ్యూనిటీ ఆగ్రహం

పంజాగుట్ట, వెలుగు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టాన్స్​జెండర్ అమెండ్​మెంట్​యాక్ట్​ను తాము వ్యతిరేకిస్తున్నామని ట్రాన్స్​జెండర్​కమ్యూనిటీ స్పష్టం చేసింది. తమను మానసిక వేదనకు గురి చేసేందుకు చట్టానికి సవరణలు చేశారని ఆరోపించింది. మంగళవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో ‘ట్రాన్స్​జెండర్​2026 చట్టం తిరస్కరణ’ అన్న అంశంపై ట్రాన్స్​జెండర్​కమ్యూనిటీ ప్రతినిధి చంద్రముఖి మువ్వల మాట్లాడుతూ చట్ట సవరణలో భాగంగా సెల్ఫ్​ఐడెంటిఫికేషన్​ను తొలగించడం, డాక్టర్​సర్టిఫికెట్​తప్పనిసరి చేయడం సరికాదన్నారు.

ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటన్నారు. తమకు అన్ని వేళలా అండగా నిలిచే ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తమ సమస్య పై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్​ జెండర్​ ప్రతినిధులు ప్రచీల్​రాథోడ్​, మధుశాలిని, న్యాయవాది కిరణ్​ రాజ్​, సుశ్మిత, శ్రేయ పాల్గొన్నారు. తర్వాత ప్రెస్​క్లబ్​ నుంచి నెక్లెస్ రోడ్డులోని డా. అంబేద్కర్​ విగ్రహం వరకు ర్యాలీ తీశారు.