జీహెచ్ఎంసీ ముందు బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన

జీహెచ్ఎంసీ ముందు బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్లతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఆఫీసులోకి చొచ్చుకొచ్చారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంసీ నుంచి తమ కార్పొరేషన్లకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ హటావో అంటూ బల్దియా హెడ్ ఆఫీసులో బీజేపీ కార్యకర్తలు పోస్టర్లను అతికించారు.