లష్కర్​లో రెండోసారి బీజేపీ జెండా ఎగరాలి : కిషన్ రెడ్డి

లష్కర్​లో రెండోసారి బీజేపీ జెండా ఎగరాలి :   కిషన్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్​లోక్​సభ నియోజకవర్గంలో రెండోసారి బీజేపీ జెండా ఎగరవేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ గెలుపే లక్ష్యంగా శ్రేణులంతా కలిసి పనిచేయాలని కోరారు. బర్కత్​పురాలోని బీజేపీ ఆఫీసులో మంగళవారం ఉగాది పండుగను పురస్కరించుకొని ఎన్నికల ప్రచార రథాలను కిషన్​రెడ్డి ప్రారంభించారు. బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శ్యాంసుందర్ గౌడ్ పాల్గొన్నారు. గౌతమ్ రావు మాట్లాడుతూ.. మే13 వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు జనం మధ్యనే ఉండాలని సూచించారు. నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, రాజశేఖర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.