టీఆర్ఎస్ను ఓడించే సత్తా బీజేపీకే ఉంది: వివేక్ వెంకటస్వామి

టీఆర్ఎస్ను ఓడించే సత్తా బీజేపీకే ఉంది: వివేక్ వెంకటస్వామి

రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని మాజీ ఎంపీ, బీజేపీజాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనకు అంతం పలికే బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, నాయకుడిపై ఉందని చెప్పారు. 

విబేధాలు, గ్రూపు తగాదాలు పక్కనపెట్టి.. పార్టీ అభివృద్ధి కోసం బీజేపీ నాయకులందరూ పని చేయాలని  వివేక్ వెంకటస్వామి సూచించారు. బీజేపీలోకి రావడానికి ఇతర పార్టీల నాయకులు ఉత్సాహంగా ఉన్నారన్న వివేక్.. తమ కార్యకర్తలందరూ ధైర్యవంతులని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలపై పోరాటం చేయాలని, కేసులకు ఎవరు కూడా భయపడవద్దని ధైర్యం చెప్పారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి, కోట్ల రూపాయల ఖర్చుతో మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.