సామాజిక న్యాయం దక్కాలంటే బీజేపీని గెలిపించాలి : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

సామాజిక న్యాయం దక్కాలంటే బీజేపీని గెలిపించాలి :   ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్, వెలుగు : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం దక్కాలంటే బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ ఉప్పల్ సెగ్మెంట్ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రామంతాపూర్​లోని పోచమ్మ ఆలయం నుంచి హాబ్సిగూడ స్ట్రీట్ నం.8లోని గిరిజన బస్తీ వరకు వేల మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీని సీఎం చేయాలన్న గొప్ప సంకల్పంతో బీజేపీ ముందుకొచ్చిందన్నారు. 

తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ అని ఆయన తెలిపారు. పోరాటం పేదలదైతే, పెత్తనం పెద్దలవుతోందని ఆయన మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్నారు. అందుకు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమన్నారు. ఉప్పల్ సెగ్మెంట్​లో తన గెలుపు కోసం మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్​కు ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.  అభివృద్ధి ప్రధాతలెవరో సెగ్మెంట్ వాసులు గుర్తించాలని ఆయన కోరారు. రేపు జరిగే ఎన్నికల్లో తనకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.