హిందువుల హక్కుల కోసమే బీజేపీ : బండి సంజయ్

హిందువుల హక్కుల కోసమే బీజేపీ : బండి సంజయ్

GHMC ఎన్నికల్లో కారును షెడ్ కు పంపిస్తే… సారు, కారు, సర్కారు ఇక రారు అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్. హైదరాబాద్ లో ఏమీ జరగబోతోందో దేశం మొత్తం చూస్తుందన్నారు. కేసీఆర్ నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాకలో ప్రజలు బీజేపీని గెలిపించారన్నారు. గోల్కొండ లో పదివేల ఆర్థిక సహాయం కోసం లైన్లో నిలబడి ఓ మహిళ చనిపోయారన్నారు. కేసీఆర్ హైదరాబాద్ ను మజ్లిస్ కు అప్పగించారని ఆరోపించారు. 80శాతం ఉన్న హిందువుల హక్కుల కోసం బీజేపీ పని చేస్తోందన్నారు. దేశ ద్రోహులకు, దేశ భక్తులకు మధ్య యుద్ధం జరుగుతోందని.. దేశ ద్రోహుల పార్టీతో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతూ నేనే గొప్ప హిందువునని కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.

బీజేపీలో చేరిన బండ కార్తీక రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు బండి సంజయ్. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో తయారీ రూప కల్పనకు సమస్యలు,సలహాల,సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాల్ సెంటర్ కు వచ్చిన సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని తెలిపారు.