- వృద్ధుల సహకారంతోనే విజయం
- బీజేపీ స్టేట్ ఆఫీసులో పంచాంగ శ్రవణం
- ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలి
హైదరాబాద్: మూడోసారి బీజేపీ దేశంలో అధికారంలోకి రాబోతుందని పంచాంగ శ్రవణ కర్త, పండితులు కాకునూరి సూర్యనారాయణ శాస్త్రి అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా నాంపల్లి బీజేపీ స్టేట్ఆఫీసులో హోమం నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు, సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా సూర్యనారాయణ శాస్త్రి పంచాంగం శ్రవణం చేశారు.
‘ఈ పంచాంగ శ్రవణం రాజకీయలకు సంబంధించినది కాదు. తమ శక్తి మేర ప్రజల కోసం వ్యయం చేయండి... పేరు వస్తుంది. వృద్ధుల సహకారం ఉంటేనే యువకులు విజయం పొందుతారు’ అని వివరించారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ ‘పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అందరు ఆశించినట్టుగానే మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది.
ఉగాది పంచాంగం కూడా ఇదే చెప్తుంది. పాడి, పంటలతో ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలి. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ మేలు జరగాలని.. గెలవాలని కోరుకుంటున్న’ అని ఆకాంక్షించారు.