మోడీ బహిరంగ సభ పోస్టర్ రిలీజ్ చేసిన లక్ష్మణ్

మోడీ బహిరంగ సభ పోస్టర్ రిలీజ్ చేసిన లక్ష్మణ్

తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ను కోరుకుంటున్నారన్నారు ఎంపీ లక్ష్మణ్. ప్రధాని మోడీ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్నారు. సిటీలో ఫ్రెక్సీ రాజకీయాలను చూస్తుంటే కేసీఆర్ అభద్రతా భావం అర్ధం అవుతోందన్నారు. కేసీఆర్ కిరాయి రాజకీయ బ్రోకర్లను నమ్ముకున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ ను బీజేపీ స్టేట్ ఆఫీసులో రిలీజ్ చేశారు లక్ష్మణ్.

జులై 2,3 తేదీలలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అంతా సిద్దమవుతోంది. వచ్చే అతిథుల కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ముఖ్యనేతలు మినహా.. కొంతమంది నేతలు హైదరాబాద్ కు ముందే రానున్నారు. ఈ క్రమంలో సమావేశానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 34 కమిటీలను ఏర్పాటు చేశారు. వీరంతా ఆయా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధానంగా టూరిజం, వంటల కమిటీలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు వచ్చే గెస్టులకు.. తెలంగాణ వంటకాలను పెట్టాలని నిర్ణయించారు. అంతేగాకుండా.. తెలంగాణ, ఏపీ టూరిజం ప్లేసులను కూడా చూపించాలని భావిస్తున్నారు.