- మూడోరౌండ్లోనూ బీజేపీదే ఆధిక్యం
హుజురాబాద్ పట్టణంలో కూడా బీజేపీ ముందంజలో ఉంది. ఉపఎన్నిక సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావులు ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అయినా కూడా పట్టణంలో మూడోరౌండు ముగిసేసరికి బీజేపీ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. మూడోరౌండ్ లెక్కింపులో ఈటలకు 4064 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్కు 3153 ఓట్లు, కాంగ్రెస్కు 107 ఓట్లు వచ్చాయి. మూడోరౌండులో బీజేపీ 911 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. మూడురౌండ్లలోనూ కలిపి బీజేపీకి 13,525 ఓట్లు రాగా.. టీఆర్ఎస్కు మూడురౌండ్లలో కలిపి 12,252 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ కు మూడురౌండ్లలోనూ కలిపి 446 ఓట్లు నమోదయ్యాయి. మూడురౌండ్లలోనూ కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1269 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకున్నారు.
మూడోరౌండు
బీజేపీ 4064
టీఆర్ఎస్ 3153
కాంగ్రెస్ 107
బీజేపీ లీడ్ 1269