కేసీఆర్ సర్కార్​ను కడిగేయండి

కేసీఆర్ సర్కార్​ను కడిగేయండి

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ సర్కార్ ను కడిగేయాలని పార్టీ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ముందుకు వచ్చినా, రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదనే విషయాన్ని ఆధారాలతో సహా ప్రజలకు వివరించాలని సూచించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి జరిగిన ద్రోహం గురించి చెప్పాలని, కేంద్ర ప్రభుత్వ విజయాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ప్రజలకు వివరించాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాలతో సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.