- మంత్రి తలసానికి బీజేపీ నేత మర్రి శశిధర్రెడ్డి సవాల్
పద్మారావునగర్, వెలుగు : రోడ్డుపై నెలరోజులుగా డ్రైనేజీ నీరు పారుతున్నా కనిపించడం లేదా మంత్రి తలసాని..? అంటూ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్నేత మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన స్థానిక పార్టీ కార్యకర్తలతో కలిసి బన్సీలాల్పేట డివిజన్ మేకలమండిలో పర్యటించారు. సనత్ నగర్సెగ్మెంట్లో ఎక్కడైనా డ్రైనేజీ సమస్య కనిపిస్తే రాజీనామా చేస్తానని గతంలో చెప్పిన మంత్రి శ్రీనివాస్యాదవ్ మాట నిలుపుకోవాలని సవాల్ చేశారు.
బోయిగూడ ఉప్పులమ్మ ఆలయ ప్రధాన రహదారిపై నెల రోజులుగా మురికి నీరు పారుతుందని స్థానికులు ఆయనతో మొరపెట్టుకోగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్న బీఆర్ఎస్ నేతలను వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపాలని ప్రజలకు సూచించారు. స్థానిక బీజేపీ లీడర్లు కృష్ణ, శివలింగం, గుంటి సత్యనారాయణ, పరమేశ్ పాల్గొన్నారు.