
రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ కూడా అదే లక్ష్యంతో ముందుకు వెళ్తుందన్నారు. కుటుంబ పాలనతో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా చేపట్టిన.. బీజేపీ భరోసా, స్ట్రీట్ కార్నర్ సమావేశాలు హైదరాబాద్ లో జోరుగా కొనసాగుతున్నాయి. ఇవాళ హిమాయత్ నగర్ బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో హైదర్ గూడ బగ్గీ కానలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ పాల్గొన్నారు. ఈ స్ట్రీట్ కార్నర్ సమావేశాల ద్వారా ప్రజా సమస్యలతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడానికి ఎంతో దోహదం చేస్తోందని ఆయన తెలిపారు.