హుజూరాబాద్ఓటమిని తట్టుకోలేకనే బీజేపీ లీడర్లు, కార్యకర్తలపై సీఎం కేసీఆర్దాడులు చేయిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. రైతులు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం రైతులను కలిసేందుకు వెళ్లిన బండి సంజయ్ కాన్వాయ్పై సూర్యాపేటలో జరిగిన దాడిని వివేక్ ఖండించారు. టీఆర్ఎస్ సర్కారుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే బీజేపీ లీడర్లపై, కేడర్పై దాడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. రైతుల దగ్గరికి బీజేపీ లీడర్లు వెళ్తే కేసీఆర్కు వెన్నులో వణుకు పుడుతోందని, అందుకే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.
రైతుల ముసుగులో టీఆర్ఎస్ గూండాలు దాడులకు తెగబడుతున్నారని మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు తల్చుకుంటే, కేసీఆర్ తిరగలేరని హెచ్చరించారు. రైతులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. నిరాశతోనే దాడులు చేస్తున్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. హుజూరాబాద్ ఓటమి భయం, నిరాశతోనే కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. హుజూరాబాద్ ఓటమి తర్వాత కేసీఆర్ మాటలు మితిమీరుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు అన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.