స్వామిజీకి, ప్రగతి భవన్ కు మధ్య కాల్ రికార్డ్ బయట పెట్టాలి: వివేక్ వెంకటస్వామి

స్వామిజీకి, ప్రగతి భవన్ కు మధ్య కాల్ రికార్డ్ బయట పెట్టాలి: వివేక్ వెంకటస్వామి

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. కేసీఆర్ కుట్రేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి అన్నారు. ఫాంహౌజ్ కేసులో పట్టుకున్నోళ్లంతా కేసీఆర్ కోవర్టులేనని ఆరోపించారు. కవితను లిక్కర్ స్కాం నుంచి తప్పించేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా అన్నారు. ఎమ్మెల్యేలు, స్వామిజీ, పైసలన్నీ కేసీఆర్ వేనన్నారు.

ఈ కేసులో స్వామిజీకి, ప్రగతి భవన్ కు ఉన్న కాల్ రికార్డులను బయటకు తీయాలని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఫాంహౌజ్ డ్రామా అంతా కూడా కేసీఆర్ స్పాన్సర్డ్ గేమ్ అని అన్నారు. స్వామీజీ కేసీఆర్ కోవర్ట్ అని తాను మునుగోడు ఎన్నికల్లోనే చెప్పానన్నారు. స్వామీజీతో తాను కలిసి ఉన్న ఫోటోలను బయట పెట్టి.. తనను కూడా ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. ఫాంహౌజ్ కేసులో ఎక్కడా కూడా బీజేపీ ప్రమేయం ఉన్నట్లు రుజువు కాలేదన్నారు.