
మునుగోడు బైపోల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరగా రావడం ఆనందంగా ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి చేసిన సేవలు, కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు అందిస్తున్న పథకాలు ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు హామీలు, ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు. మునుగోడులో బీజేపీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.
స్పీడ్ పెంచుతున్న బీజేపీ నేతలు
మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో బీజేపీ నేతలు స్పీడ్ పెంచుతున్నారు. నియోజకవర్గంలో ఏ నలుగురు కలిసినా తమ పార్టీ గురించి మాట్లాడుకునేలా ప్లాన్ చేశారు. ఓటర్లలో విస్తృతంగా చర్చ జరగాలంటే వందలాది మంది కార్యకర్తలను మునుగోడుకు పంపించాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం జిల్లాల్లోని ముఖ్య కార్యకర్తల లిస్ట్ రెడీ చేస్తున్నారు. మునుగోడును కాషాయమయం చేసేలా వర్క్ చేస్తున్నారు.
వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ
మునుగోడులో మాజీ ఎంపీ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ పనిచేస్తోంది. నియోజకవర్గం లోని అన్ని మండలాలకు ఇన్ ఛార్జీలను, సమన్వయ కమిటీలను నియమించారు. మరో 2, 3 రోజుల్లో ప్రతీ గ్రామానికి ముగ్గురు లీడర్స్ తో గ్రామ కమిటీలను వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ముఖ్య కార్యకర్తలను మునుగోడుకు పంపించనున్నారు బీజేపీ నేతలు. ఒక్కో ఓటర్ ను కనీసం మూడు నుంచి నాలుగు సార్లు కలుస్తామని చెప్తున్నారు.