మాలల హక్కుల కోసం అందరూ ఒక్కటి కావాలి:వివేక్ వెంకటస్వామి

మాలల హక్కుల కోసం అందరూ ఒక్కటి కావాలి:వివేక్ వెంకటస్వామి

పార్టీలకు అతీతంగా మాలల హక్కులు, అభివృద్ధి కోసం కృషి చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆవుల బాలనాధం పేద ప్రజల కోసం పోరాటం చేశారని కొనియాడారు. మాలలంతా కలిసి కట్టుగా ఉండాలని..మన సమస్యలపై మనమే పోరాడి సాధించాలని పిలుపునిచ్చారు. మాలలు మాటిస్తే నిలబెట్టుకుంటారని అందరికి అర్థం కావాలన్నారు. మాలల హక్కుల కోసం అందరూ ఒక్కటి కావాలని..న్యాయం కోసం కృషి చేసినప్పుడే ధైర్యం వస్తుందన్నారు. జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ జాంబాగ్లో జాతీయ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపకులు ఆవుల బాలనాధం 77వ జయంతి, మాలల అలాయ్ బలాయ్ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.