
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెప్పారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం అలియబాద్ చౌరస్తాలో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్, కేటీఆర్, కవిత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో పాలన రజాకార్ల ప్రభుత్వంగా మారిపోయిందని, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. నిరసనలు చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి శామీర్ పేట పోలీస్ స్టేషనకు తరలించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. విమర్శలు చేసినంత మాత్రానవ్యక్తిగత దాడులకు దిగడం సరితకాదని అన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న గుండాగిరి, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని , త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ కి తగిన బుద్ధి చెప్తారని నాయకులు అభిప్రాయపడ్డారు.