శంషాబాద్, వెలుగు : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడంతో శంషాబాద్ బీజేపీ మండల శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక బస్టాండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ..
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్క వేణుగోపాల్, శంషాబాద్ మండల అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య, బీజేపీ సీనియర్ నేత లక్ష్మయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.