తమ తప్పిదాలను కప్పిపుచ్చకోవడానికే గవర్నర్ తమిళ సై పై అధికార పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి అన్నారు. గవర్నర్ పై హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ.. గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి వెంటనే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని మహిళా మోర్చా నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్కార్ కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు.
For More News..