ఓట్ల కోసం కేసీఆర్ పూటకో మాట

ఓట్ల కోసం కేసీఆర్ పూటకో మాట

హైదరాబాద్: ఓట్ల కోసం పూటకో మాట మార్చే సీఎం రాష్ట్రానికి అవసరమా అంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ పాలనపై విరుచుకుపడుతూ రఘునందన్ రావు ట్వీట్ చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ దాటరని, ఆయన అరాచక శక్తులకు కొమ్ముకాస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. పథకాల పేరుతో కేసీఆర్ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలపై చర్యలు తీసుకోవడంలేదని ఫైర్ అయ్యారు. ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్ అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని కోరుతూ సాలు దొర... సెలవు దొర అంటూ రఘునందన్ రావు ట్వీట్ చేశారు.