ఒక్క ఎలక్షన్ లో ఓడిపోతేనే ఇంత రెచ్చిపోయి మాట్లాడాలా?

ఒక్క ఎలక్షన్ లో ఓడిపోతేనే ఇంత రెచ్చిపోయి మాట్లాడాలా?

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోని రైతులను కలవడానికి వెళ్తే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అడ్డుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడంలేదని ఆయన అన్నారు.

‘రైతులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి.. రైతులను మోసం చేసే ముఖ్యమంత్రి అయ్యాడు. అసెంబ్లీలో మాత్రం ప్రతి గింజా కొంటాం అంటారు. బయట మాత్రం కేంద్రంపై అబంఢాలు వేస్తారు. సీఎం కేసీఆర్ చాలా తెలివిగలవాడినని అనుకుంటారు. కానీ అంత తెలివిగలవారయితే చిన్నచిన్న విషయాలపై రాజకీయం చేయరు. ఒక హుజురాబాద్ ఎలక్షన్ లో ఓడిపోతేనే ఇంత రెచ్చిపోయి మాట్లాడాలా? ముందుముందు ఇంకా చాలా ఎలక్షన్స్ వస్తాయి. మీరు భయంతో ముందస్తు ఎలక్షన్ కూడా పోయేలా కనిపిస్తున్నారు. ఆ ఎన్నికలలో ఎంత బలం పెడతారో పెట్టండి. మీరు తప్పుడు కామెంట్లు చేస్తూ గెలవాలనుకుంటున్నారు. మా అధ్యక్షుడు నిజాలు మాత్రమే కామెంట్ చేస్తారు. ఆయనపై మాకు గర్వంగా ఉంది. చిన్నచిన్న నేతలతో కలిసి తప్పుడు కామెంట్లు చేస్తే మీకే నష్టం అయితది. యావత్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు’ అని రాజాసింగ్ అన్నారు.