కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు!

కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు!

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడాన్ని ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు.ఇదంతా కేసీఆర్ రాజకీయ కుట్రలో భాగమన్నారు.మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అవకాశం  సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాల్సిన గౌరవ స్పీకర్ కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సభా సంప్రదాయల్ని పాటించకుండా ప్రతిపక్ష శాసన సభ్యుల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. పోలీసులను సెక్యూరిటీగా పెట్టుకునే కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు.చివరికి దేవాలయం లాంటి అసెంబ్లీని కూడా పోలీసులతోనే నడుపుతున్నారని..కేసీఆర్ నయా నిజాం అనుకుంటూ..నిరంకుశంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ధ్వజమొత్తారు. తెలంగాణాలో కల్వకుంట్ల రాజ్యాంగం నడవనీయమని...ఈ నయా నిజాం రాజ్యన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

ద‌ళిత బంధు ప‌థ‌కానికి భారీగా నిధులు

అసెంబ్లీ గేటు ముందు నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు