తెలంగాణ, ఢిల్లీలో లిక్కర్ ఏరులై పారుతోంది : లక్ష్మణ్

తెలంగాణ, ఢిల్లీలో లిక్కర్ ఏరులై పారుతోంది : లక్ష్మణ్

తెలంగాణ, ఢిల్లీలో లిక్కర్ ఏరులై పారుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్  విమర్శించారు. లిక్కర్కు కేసీఆర్ నడక నేర్పారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ కల్తీ అవుతోందన్న ఆయన.. లిక్కర్ పాలసీని దేశమంతా తేవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులను చూసేందుకు వచ్చిన  పంజాబ్ సీఎం మాన్ .. ఆ ప్రాజెక్టుల భూనిర్వాసితుల బాధలను కూడా వింటే ఇంకా బాగుండేదన్నారు. కొండగట్టు అభివృద్ధి అంటూ కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ తప్పదని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.బీజేపీ అధికారంలోకి  వచ్చాక దేవాలయాలపై ప్రభుత్వ పెత్తానన్ని తొలిగిస్తామని లక్ష్మణ్  చెప్పారు.