ప్రజల గోస తెలుసుకోడానికే భరోసా యాత్ర చేస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో లక్ష్మణ్ పాల్గొన్నారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన ఏ పథకాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు.
తన కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ ...నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. ప్రధాని మోడీ పైసలను ఖర్చు పెట్టి కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నాడని లక్ష్మణ్ ఆరోపించారు. మంచిర్యాల వరద బాధితులకు ప్రభుత్వం ఒక్క పైస కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ ను పార్టీ కార్యకర్తలు భారీ గజమాలతో సన్మానించారు.