
- రెండు రాష్ట్రాల డెవలప్మెంట్కు ప్రధాని సానుకూలం: లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబు కృషి చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సూచించారు. గత పదేండ్లలో అవి ముందుకు పడలేదని, వచ్చే ఐదేండ్లలో పరిష్కారం అవుతాయన్న నమ్మకం తనకు ఉన్నదని చెప్పారు. శనివారం ఆయన పార్టీ స్టేట్ఆఫీస్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం, ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల వరకే అని, అభివృద్ధిపై ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి సారించాలని సూచించారు. కేంద్రం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని చెప్పారు. డెవలప్ మెంట్ను పక్కనపెట్టి ప్రాంతీయత పేరుతో ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధి పొందాలని చూడొద్దని లక్ష్మణ్ సూచించారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ సీఎం చంద్రబాబు కు లక్ష్మణ్ లేఖ రాశారు.