జుక్కల్ లో 4 వ రోజు పల్లె గోస– బీజేపీ భరోసా యాత్ర

జుక్కల్ లో 4 వ రోజు పల్లె గోస– బీజేపీ భరోసా యాత్ర

కామారెడ్డి : రాష్ట్ర ప్రజలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్​ వెంకటస్వామి బోనాలు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండగ నిదర్శనమని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రం అవినీతి, అప్పుల్లో కూరుకుపోయిందన్న వివేక్ వెంకటస్వామి.. ప్రజలకు అంతా మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

జుక్కల్ లో 4వ రోజు ‘పల్లె గోస– బీజేపీ భరోసా’ యాత్రలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. పిట్లం మండలం అన్నారం గ్రామంలో కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బెజుగం చంద్రశేఖర్, జిల్లా ప్రెసిడెంట్ అరుణ తార, మాజీ జడ్పీ చైర్మన్ కాటేపల్లి వెంకటరమణరెడ్డి వివేక్ ను ఘనంగా సన్మానించారు.