BRS పేరుతో కేసీఆర్ మరో డ్రామా

BRS పేరుతో కేసీఆర్ మరో డ్రామా

అవినీతి సొమ్ముతో రాష్ట్రాల్లో గెలవాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. సచివాలయానికి వెళ్లని సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని కాలం గడిపిన కేసీఆర్.. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో మరో డ్రామాకు సిద్దమయ్యారని చెప్పారు. రాష్ట్ర ప్రజలను నమ్మించినట్లే.. దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్, వీఆర్ఎస్ అవుతుందన్నారు.